శ్రీకాకుళం, మే 30 : రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో ఆదివారం నుండి గుండె వ్యాధుల ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ నుండి కోలుకున్న అనంతరం గుండె వ్యాధులతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలుస్తుందని అన్నారు. దీని నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్ మే 30 నుండి జూన్ 30వ తేదీ వరకు గుండెకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య సేవలలో రక్త పరీక్షలు, 2డి ఇకో, ఇసిజి, టి.ఎమ్.టి. మొదలగు పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు అందరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. అందుబాటులో ఉన్న గుండె వ్యాధుల వైద్య నిపుణులు డా. అరుణ్ కుమార్, డా.విజయ్, డా.నాగచైతన్య, గుండె శస్త్ర చికిత్సల నిపుణులు డా.రవి కిరణ్, డా.అనిరుధ్ అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు.
ఇందుకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, బాధ్యత గల డా.ప్రవీణ్ కుమార్ నంబర్లను తెలిపారు.
7680945332/ 47, 6309990628/ 29
జిల్లా ప్రజలు తక్షణం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి గుండె రుగ్మతలకు లోనుకావద్దని ఆయన విజ్ఞప్తి చేసారు.
0 Comments