*విద్యుత్ షాక్ తో ఆరుగురు మృతి*
జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
రొయ్యల చెరువు దగ్గర ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఆరుగురు మృతి చెందారు.
ఈ ఘటన రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో చోటు చేసుకుంది.
గురువారం అర్ధరాత్రి రొయ్యల చెరువు దగ్గర ఒడిశా వాసులు కాపలాగా పనిచేస్తున్నారు.
అర్ధరాత్రి చెరువు గట్టుపై నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతరం మృతుల వివరాలను పోలీసులు వెల్లడించారు.
మృతులు: రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్ గా పోలీసులు గుర్తించారు.
0 Comments