ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

గాంధీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు**400 మందికి కొనసాగుతున్న చికిత్స*

*గాంధీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు*
*400 మందికి కొనసాగుతున్న చికిత్స*

గాంధీ హాస్పిటల్‌లో రెండు వారాలుగా కొరోనా సివియార్టీ కేసుల సంఖ్య పెరుగుతుందని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.

ఇటీవల మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది.

గాంధీలో సాధారణ సేవలు పెంచాలని చూస్తున్న తరుణంలో కేసుల సంఖ్యపెరగడం ఆందోళన కలిగిస్తుంది.

ఆయన మాట్లాడుతూ సెకండ్‌ వేవ్‌ ఇంకా కొనసాగుతూనే ఉందని ఇలాగే కొనసాగితే థర్డ్ వేవ్‌ వొచ్చే ప్రమాదముందని అన్నారు.

పండుగలు, సభలు, సమావేశాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

థర్డ్ వేవ్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామన్నారు.

ప్రస్తుతం గాంధీలో 400 మంది వరకు చికిత్స పొందుతున్నారని చెప్పారు.

గాంధీ హాస్పిటల్‌లో నాన్‌ కోవిడ్‌ సేవలు ప్రారంభించడం కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమేనని ఆయన చెప్పుకొచ్చారు.

ఆగస్టు 3 నుంచి నాన్‌ కోవిడ్‌ సేవలు ప్రారంభించడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని రాజారావు వెల్లడించారు.

Post a Comment

0 Comments