సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్-, శ్రీకాకుళంజిల్లా అధికారి బి. తారకప్రసాద్ మాట్లాడు తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల్లో భాగంగా దేశమంతా పెద్ద ఎత్తున తల్లిపేరిట మొక్క నాటడం కార్యక్రమంలో పాల్గొంటున్నారని, దీనిలో ఆంధ్ర ప్రదేశ్ మరింత ముందుంజలో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో, డా. బిఆర్ఏయూ రెక్టార్ ఆచార్య బి. అడ్డయ్య, రిజిస్ట్రార్ ఆచార్య సి. సుజాత, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. ఎం. అనురాధ, జర్నలిజం విభాగం అధ్యాపకులు డా. ఆర్.తిరుపతిరావు, డా. జి.లీలా వరప్రసాదరావు, డా. వై.డి. రామదాస్, పీడీ డా. ఎం. శ్రీనువాసు, అధ్యాపకులు ఎం.రామారావు, టి.భవాని తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులచే నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు.
0 Comments