శ్రీకాకుళం / పోలాకి, డిసెంబర్ 20: రహదారుల అభివృద్ధిపై పంచాయితీరాజ్ అధికారులు దృష్టి సాధించాలని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పంచాయతీల అభివృద్ధికి గాను నిధులను మంజూరు చేసిందని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం పోలాకి మండలం కత్తిరివానిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నరసన్నపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలాకి నరసన్నపేట జలుమూరు సారవకోట మండలాలలో రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఈ సత్యం నాయుడు, ఏఈలు మోహన్, బగ్గు నర్సింగరావు,కె. శ్రీధరరావు పాల్గొన్నారు.*
0 Comments