ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

దోమలపై మహా యుద్ధంఐదు లక్షల గాంబూసియా చేపలు సిద్ధం.

శ్రీకాకుళం, ఆగస్టు 30: జిల్లా వ్యాప్తంగా దోమల నిర్మూలనకు ఐదు లక్షల గాంబూసియా చేప పిల్లలను విడిచిపెట్టే మహా కార్యక్రమం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం అరసవల్లి దేవస్థానం ఇంద్రపుష్కరినిలో 750 చేప పిల్లలను వదిలిన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో పెరిగే దోమల బెడదను అరికట్టడంలో గాంబూసియా చేపలు అసలు అస్త్రం అని స్పష్టం చేశారు. దోమల లార్వా ఆక్సిజన్ కోసం నీటి మీదకు వచ్చిన క్షణంలో గాంబూసియా చేపలు వాటిని పూర్తిగా తినేస్తాయి. కుంటలు, చెరువులు, చిన్నపాటి నీటి నిల్వల్లో ఎక్కడైనా ఇవి జీవించగలవు. చిన్న సైజులో ఉన్నా వీటి వేగమే దోమలకు ముప్పు అని వివరించారు.

జిల్లా వ్యాప్తంగా 5 లక్షల చేప పిల్లలు విడిచిపెట్టే ప్రణాళికను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి వ్యాధుల నివారణకు గాంబూసియా జీవ వైద్యమవుతుందని ఇది పర్యావరణానికి హాని లేకుండా, సులభంగా దోమల పెరుగుదలను అడ్డుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కె. అనిత, జిల్లా మలేరియా అధికారి పి.వి. సత్యనారాయణ, అరసవల్లి దేవస్థానం ఈఓ ప్రసాదరావు, మెడికల్ ఆఫీసర్ డా. సాయి దివ్య, ఏఎంఓ శ్రీనివాసరావు, వి‌బి‌డి కన్సల్టెంట్ ఎల్. శ్రీకాంత్, మలేరియా సబ్ యూనిట్ అధికారి నరసింహం, ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments