శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ నెల 5న (బుధవారం) ఉదయం 9.30 గంటలకు నగరంలోని ఎన్జీవో హోమ్లో నిర్వహించనున్నట్టు ఎన్ఏజే జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు సత్తారు భాస్కరరావు, ఏపీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కృష్ణ, జి.లక్ష్మణరావు తెలిపారు. జర్నలిస్టుల హక్కులు`బాధ్యతలు`చట్టాలు అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం జరుగనున్నట్టు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలు, పాత్రికేయ సంఘాలు,  పాత్రికేయమిత్రులు హాజరుకావాలని వారు కోరారు.
0 Comments