నరసన్నపేట పద్మావతి డిగ్రీ కళాశాలకు చెందిన తులగాపు తారకేష్ , ధర్మాన దాక్షాయని ఇన్ఫోసిస్ సంస్థకు ఎంపికయ్యారని కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు . రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో వీరు ఉద్యోగం సాధించారని అయన తెలిపారు. విద్యార్థులకు ఇన్ఫోసిస్, విప్రో వంటి బహుళజాతి సంస్థలో ఉద్యోగం సాధించడానికి అవసరమైన శిక్షణ తమ కళాశాలలో అందిస్తున్నట్టు ఆయన అన్నారు. ఎంపికైన విద్యార్థులను రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ జిల్లా మేనేజర్ గోవిందరావు, కళాశాల చైర్మన్ పల్లి సూరిబాబు, అధ్యాపకులు అభినందించారు.
0 Comments