ఏపీలో నాలుగు ప్లాంట్లు నిర్మిస్తున్నారని...
తెలంగాణలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని భువనేశ్వరి తెలిపారు.
ఈ కార్యక్రమానికి దాతల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఆమె పేర్కొన్నారు.
ప్రధానాంశాలు:
రాష్ట్రంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు అనాథ శవాలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు..
చంద్రబాబు,నారా భువనేశ్వరి.
తెలంగాణ ప్రజలకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి శుభవార్త చెప్పారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణలో మరో రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు మేనేజింగ్ ట్రస్టీ
నారా భువనేశ్వరి తెలిపారు.ఈ సంద్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన నారా భువనేశ్వరి..ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నాలుగు ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఆమె అన్నారు.
కరోనా కష్టకాలంలో కరోనా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక ముందడుగు వేసిందన్నారు భువనేశ్వరి.
ఈ సందర్భంగా దాతలందరికీ భువనేశ్వరి పేరుపేరునా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
అనాథ శవాల అంతిమ సంస్కారాలకు ట్రస్ట్ సేవా విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
టెలీమెడిసిన్, మందుల పంపిణీ,అన్నదానం కార్యక్రమాలు కొనసాగుతున్నా యన్నారు.
24/7 కాల్ సెంటర్ ద్వారా కరోనా రోగులకు నిరంతర సేవలు అందిస్తున్నట్టు చెప్పారు.
0 Comments