ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

లీగల్ ఓపినియర్ తీసుకున్నాం..కేసీఆర్ జైలుకే: బండి సంజయ్.

ప్రజా పత్రిక: సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.

అయితే ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందని తెలిపారు. నేడు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.......

ఇతర పార్టీలు చేసే విమర్శలు మేము పాటించుకోము.

టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలను పూర్తిగా సేకరించాం.

ఇప్పటికే టీఆర్ఎస్ 18 మంది ముఖ్యనేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం.

మా ఉద్యమ పంథానే వేరుగా ఉంటుంది. సీఎం కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా తీస్తున్నాం.

వారం రోజులుగా సీఎం కేసీఆర్ కేసుల పైనే ఆరా తీస్తున్నాం.
ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయింది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో బీజేపీలో చేరతారు.

ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారు.

ఎలాంటి హామీ లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారు. బీజేపీలో ఎవరు చేరినా.

ఎలాంటి హామీ ఉండదు. బీజేపీ సిద్ధాంతాలతో పాటు ప్రధాని మోదీ పాలన నచ్చి ఈటల బీజేపీలో చేరుతున్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ మంచి వేదిక అని భావిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించే వారికి బీజేపీ అండగా ఉండి పోరాటం చేస్తుంది అని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments