ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కృష్ణా కలెక్టర్ ను కలిసిన యువనేత, స్పీకర్ తమ్మినేని తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్

విజయవాడ :శ్రీకాకుళం జిల్లాలో ఐఏఎస్ అధికారిగా కాకుండా ఒక సేవకుడిగా ఎందరో మనసులు గెలుచుకుని ఇటీవల బదిలీపై వెళ్లి కృష్ణా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జె.నివాస్ ను యువనేత, స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం చిరంజీవి నాగ్ తో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తనయులు  చైతన్య కూడా కలెక్టర్ ను కలిసిన వారిలో   ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా శ్రీకాకుళం జిల్లా విశేషాలను పంచుకున్నారు. పలు అంశాలను చర్చించారు.

Post a Comment

0 Comments