శ్రీకాకుళం, జూలై 31 : జిల్లావ్యాప్తంగా నేటి నుండి తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీచేసారు. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆగష్ట్ 1 నుండి 7వ తేది వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తల్లి పాలు ఇవ్వటాన్ని ప్రోత్సహించండి – ఇది మనందరి బాధ్యత అనే నినాదంతో ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. సాదారణ మరియు సి – సెక్షన్ డెలివరీ రెండింటిలోనూ డెలివరీ అయిన ఒక గంటలోపు తల్లి తమ బిడ్డకు తప్పకుండా పాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది తల్లికి మరియు బిడ్డకు ఆరోగ్యకరమని ఆయన చెప్పారు. తల్లి పాల వారోత్సవాలలో ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
0 Comments