శ్రీకాకుళం, ఏప్రిల్ 9 : మహాత్మా జ్యోతిభా పూలే 196వ జయంతి వేడుకలను ఈ నెల 11న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10.00 గం.లకు స్థానిక పొన్నాడ వంతెన వద్ద గల మహాత్మా జ్యోతిభా పూలే విగ్రహం వద్ద వేడుకలు జరుగుతాయని, కోవిడ్ - 19 దృష్ట్యా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ వివరించారు.
0 Comments