నవంబర్12న జాతీయ లోక్ అదాలత్.
కేసుల పరిష్కారమే ప్రధాన లక్ష్యం.
జిల్లా న్యాయ సేవాధికారి గోపీ.
శ్రీకాకుళం, అక్టోబర్ 19:- రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలు అనుసరించి నవంబర్ 12 వ తేదీన శ్రీకాకుళంలో అన్ని కోర్టు సముదాయాలలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ , శ్రీకాకుళం గుత్తాల గోపీ తెలిపారు. ఈ సదర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీకాకుళంజిల్లా లో న్యాయ మూర్తులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, అందరు న్యాయ అధికారులను జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం చేయటం కోసం అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో అదనపు జిల్లా న్యాయ మూర్తులు టీ . వెంకటేశ్వర్లు, జి. చక్రపాణి, శ్రీమతి కె. శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జిలు శ్రీమతి కే. నాగమణి, శ్రీమతి ఎం.అనురాధ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
0 Comments