నరసన్నపేట ఉపఖజానా కార్యాలయంలో విశ్రాంత పెన్షనర్లు కరెంట్ లేని సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని నరసన్నపేట ఉప సర్పంచ్ ససుపల్లి కృష్ణ బాబు వద్ద ప్రస్తావించారు. ఎస్టీవో, విశ్రాంత ఉద్యోగులు అభ్యర్థన మేరకు.. స్పందించిన క్రిష్ణ బాబు రూ.25 వేల విలువైన ఇన్వెర్టర్, బ్యాటరీ అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. పలువురు సాసు పల్లి కృష్ణ బాబును అభినందించారు.
0 Comments