ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం.

శ్రీకాకుళం:-మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ( ఆప్కాస్) కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ &ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,టి.నూకరాజు, రాష్ట్ర కార్యదర్శి ఎన్. వై. నాయుడు, వి.రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా 4వ మహాసభల సందర్భంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బాపూజీ కళామందిర్ వరకు డప్పుల వాయిద్యాలతో మున్సిపల్ కార్మికులంతా భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం బాపూజీ కళామందిర్ లో ఎన్ బలరాం అధ్యక్షతన జిల్లా మహాసభ జరిగింది. మహాసభ నుండి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు రిపోర్టును జిల్లా కన్వీనర్ రమేష్ పట్నాయక్ ప్రవేశపెట్టారు దీనిపై శ్రీకాకుళం ఆముదాలవలస ఇచ్చాపురం పలాస మున్సిపాలిటీల నుంచి ప్రతినిధులు మాట్లాడారు. ఈ మహాసభ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించిందని, అవుట్సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల అనే పదాల్లో తేడా తప్ప చదువులు, పనులు ఒకటేనని చెప్పిన ముఖ్యమంత్రి మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం కార్మికులు మోసగించడమేనని విమర్శించారు. గత 30 ఏళ్లుగా మురికి కూపాలలో పని చేస్తూ రాష్ట్ర జనాభాలో 40% ప్రజల అవసరాలు తీరుస్తున్న మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తుందని అన్నారు.

ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షరూపాయలు ఇచ్చినా మున్సిపల్ కార్మికులు చేసే పనిని ఇతరులెవ్వరూ చేయలేరని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీలో ఏ ఒక్క కార్మికునికి పర్మనెంట్ చేయలేదని విమర్శించారు. మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నా కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత స్వభావం కలిగిన మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 010 ద్వారా జీతాలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ మరియు రిస్క్ ఎలవేన్స్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హెల్త్ అలవెన్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 వేతనం చెల్లించాలని, అన్ని విభాగాల్లోని కార్మికులకు రక్షణ పరికరాలు పనిముట్లు భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభలలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి. హెచ్ అమ్మన్నాయుడు పి తేజేశ్వరరావు కార్యదర్శి ఎన్వి రమణ జిల్లా కోశాధికారి సత్యనారాయణ హాజరై మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు .

*జిల్లా నూతన కమిటీ* 
 16 మందితో ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులుగా పి.తేజేశ్వరరావు, అధ్యక్షులు రమేష్ పట్నాయక్, ఉపాధ్యక్షులుగా అరుగుల. గణేష్, సిహెచ్.మురుగన్, ఏ.రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా ఎన్. బలరాం, సహాయ కార్యదర్శులుగా బి. కూర్మారావు, కళ్యాణ.రాజు కోశాధికారిగా టి.సంతోష్, కమిటీ సభ్యులుగా గంగాధర్ రథో, ఎమ్. రవి, జే.వాసు,డి.యుగంధర్, కే.రాజు,ఏ.రాము, ఎల్.రవి లను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

Post a Comment

0 Comments