నరసన్నపేట, సెప్టెంబర్ 9:నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) సంస్థలో రూ.550 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చిందని, ఇన్నాళ్లకు అతని పాపం పండిందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శనివారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ చట్టం ఎవరికీ చుట్టం కాదని, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబుకు ఈ విషయం ఇప్పటికి అర్థమై ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో అలజడు
లు సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వైయస్ఆర్సీపి శ్రేణులు వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విభాగం ఈ విషయంలో చురుగ్గా ఉండాలని, బాబు ఏ తప్పు చేయలేదని పచ్చ మీడియా గగ్గోలు పెట్టే అంశాలను, అసత్యాలను తిప్పి కొట్టాలన్నారు. ఈ కేసులోని అన్ని అంశాలను సామాన్య ప్రజలకు సైతం పూర్తిగా తెలిసేలా వాస్తవాలను వివరించడంలో సోషల్ మీడియా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ ఖజానాను దోచేసి, పోలవరం లాంటి ప్రాజెక్టులను ఏటీఎంలా వాడుకొని రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన చంద్రబాబుపై పూర్తిస్థాయి విచారణలు చేపట్టి తిన్న సొమ్మంతా కక్కించాల్సి ఉందని కృష్ణ దాస్ పేర్కొన్నారు.
0 Comments