ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఎన్నికల సంఘ మార్గదర్శకాలు తు.చ‌. త‌ప్ప‌క పాటించాలి.జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

శ్రీకాకుళం, నవంబర్ 28: ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘ మార్గదర్శకాలు సెక్టార్‌ అధికారులు తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సెక్టార్‌ అధికారులు, సెక్టార్ పోలీసు అధికారుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులదే కీలక పాత్ర‌ ఉంటుందని అన్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా సెక్టార్‌ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘ మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. రిటర్నింగ్‌ అధికారులకు ఈ సెక్టార్‌ అధికారులు అనుసంధానమై ఉంటారని, ఒకొక్క రిటర్నింగ్‌ అధికారి కింద 20 నుంచి 30 సెక్టార్లు ఉంటాయని, ఒకో సెక్టార్‌ అధికారికి 10 నుంచి 15 పోలింగ్‌ కేంద్రాల పరిధి ఉంటుందని చెప్పారు. సెక్టార్‌ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్‌ అధికారాలు ఇస్తామని, సెక్టార్‌ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్‌ కేంద్రాన్నీ స్వయంగా సందర్శించి వసతులను, ఓటర్లకు అనుకూలతలను పరిశీలించాలని, సమస్యాత్మక అంశాలను నమోదు చేసుకోవాలన్నారు. తమ పరిధిలో సోషల్‌, కమ్యూనిటీ, పొలిటికల్‌, లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులు ఎలా ఉన్నాయో పర్యవేక్షించాలని సూచించారు. బూత్‌ లెవల్‌ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌హెచ్‌వోలను ఒకరికి ఒకరు పరిచయం చేసుకోవాలని, గ్రామాల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించాలన్నారు. ఎన్నికలకు ఎలక్టోరల్‌, ఈవీఎం, పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ సిబ్బంది కీలకమని కలెక్టర్‌ అన్నారు. ప్రతి ఎన్నికలనూ కొత్తగానే చూడాలని, ఏ దశలోనూ తప్పిదాలకు ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల నిర్వహణపై సెక్టార్‌ అధికారులకు అవగాహన కల్పించారు.ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని కలెక్టర్ కోరారు.

మాస్టర్ ట్రైనీ జయ దేవి ఎన్నికల నిర్వహణ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ఎన్నికల సంఘ మార్గదర్శకాలను అనుసరించి సెక్టార్‌ అధికారులకు ఉన్నట్టు వంటి అధికారాలు, నిర్వహించవలసిన విధులు గురించి వివరించారు. సెక్టార్‌ అధికారుల అనుమానాలు నివృత్తి చేసి, అనంతరం ఈవీఎంల ద్వారా ఓటింగ్ విధానాన్ని వివరించారు.

శిక్షణా కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పరిషత్ సిఇఓ వెంకట్ రామన్, శ్రీకాకుళం ఆర్డీవో సిహెచ్. రంగయ్య, పలాస ఆర్డీవో భరత్ నాయక్, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలకు ఎన్నికల విధుల కోసం నియమితులైన సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులు హాజరయ్యారు.

Post a Comment

0 Comments