ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రజా పిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

శ్రీకాకుళం: సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి ప్రజల నుంచి పిర్యాదులు స్వీకరించి,వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదు దారుల అర్జీలు,వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే తెలియ పరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశించారు.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా అర్జీ దారులు వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పి అధికారులను ఆదేశించారు.

*పిర్యాదులు వివరాలు* 
కుటుంబ తగాదాల పై 6 ఫిర్యాదులు,(సివిల్)పౌర సంబంధాలపై 15, మోసపురితమైనవి 8, దొంగతనాలు పై 3 ఫిర్యాదులు, పాత ఫిర్యాదులు 9, ఇతరత్రా అంశాలపై 17 పిర్యాదులుతో కలిపి మొత్తానికి 58 ఫిర్యాదులు అందాయి.

Post a Comment

0 Comments