సరసన్నపేట మేజర్ పంచాయతీ ఈఓ గా ద్రాక్షాయిని బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో మేజర్ పంచాయతీ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తామన్నారు. అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామన్నారు. పారిశుద్ధ్యం పై ప్రత్యేకమైన దృష్టి పెడతామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పంచాయతీ సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.
0 Comments