ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. కలెక్టర్

శ్రీకాకుళం,అక్టోబర్ :22: జిల్లాలో చేపడుతున్న ఆర్ అండ్ బి పనులు సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి ఆర్ అండ్ బి ఎస్ఈ ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లాలో నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి ఆయన మంగళవారం సమీక్షించారు. బిల్లులు పెండింగులో ఉంటే ఆ జాబితాను అందజేయాలని ఆర్ అండ్ బి ఎస్ఈ ని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ నూతన కలెక్టరేట్ నిర్మాణం పనులపై ఆర్ అండ్ బి ఎస్ఈ జాన్ సుధాకర్ కలెక్టర్ కు వివరించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో ప్రస్తుతం జరుగుతున్న పనులు, ప్రస్తుతం ఏఏ పనులు జరుగుతున్నవి అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ లో చేసిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంట్రాక్టర్ కలెక్టర్ కు వివరించారు. సమావేశ మందిరం, కలెక్టర్ పేషీ లకు పలు సూచనలు జారీ చేశారు. కోడిరామమూర్తి మైదానానికి సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. డిపిఆర్ తక్షణమే పూర్తి చేసి అందజేయాలని ఆదేశించారు. 
గార మండలం వనితమండల - పోలాకి కనెక్టివిటీ హై లెవల్ క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పోలీసు, ఎంపిడిఓ, తదితరమైన కార్యాలయాలు మార్చాలన్నారు. భూ సేకరణకు సంబంధించి పేమెంట్ చేయాల్సి ఉందన్నారు. బ్రిడ్జికి సంబంధించి ఫైల్ గూర్చి ఆర్ అండ్ బి ఈఎన్సీ తో వెంటనే మాట్లాడారు. కళింగపట్నం - శ్రీకాకుళం - పార్వతీపురం రోడ్ పైన సమీక్షించారు. రహదారి పనులను సత్వరమే పూర్తి చేయాలని, రహదారికి ఇరువైపులా బ్యూటిఫికేషన్ పనులు గూర్చి ఆయన అడిగి తెలుసుకున్నారు. విజయాదిత్య పార్క్ పనులకు సంబంధించి పార్కింగ్, మరుగుదొడ్ల, సైకిల్ ట్రాకింగ్, ఫుట్ పాత్, గ్రీనరీల గూర్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లను ఆయన అడిగి తెలుసుకొని సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెద్దపాడు చెరువు డిపిఆర్ పైన చర్చించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కె. సాయి ప్రత్యూష, ఆర్ అండ్ బి ఎస్ఈ జాన్ సుధాకర్, ఈఈ, డిఈలు, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments