ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఎరువులపై సమాచారం కొరకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్


శ్రీకాకుళం, జూలై 24 : జిల్లాలో ఎరువుల సరఫరా, వినియోగం పై కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నియంత్రణ విభాగంలో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాధ స్వామి తెలిపారు. ఎరువుల లభ్యతపై లేదా ఇతర సంబంధిత సమాచారం కోసం రైతులు 9121863788 నంబరుకు సంప్రదించవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లాలో సరిపడినంత ఎరువుల నిల్వలున్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. అవసరానికి మించి ఎరువులను వినియోగించడం వల్ల నేల సారం తగ్గడంతో పాటు దిగుబడిపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని, రైతులు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Post a Comment

0 Comments