జలుమూరు మండలం, చల్లవానిపేట సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నామని తెలిపారు. “దీపం” పథకం, “తల్లికి వందనం”, “స్త్రీ శక్తి”, “అన్నదాత సుఖీభవ” వంటి పథకాల ద్వారా మహిళలు, రైతులు, పేద కుటుంబాలందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ఇప్పుడు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు ద్వారా మరింత పారదర్శకతతో, వేగవంతంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారుల దాకా చేరుతాయని పేర్కొన్నారు. “ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, అభివృద్ధి – సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో* PACS చైర్మన్లు ,మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, జెడ్పిటిసి ప్రతినిధి, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు ,ఇతర ప్రజాప్రతినిధులు తహశీల్దార్ గారు,ఎంపీడీవో గారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments