శ్రీకాకుళం : డా. బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ 3వ సెమిస్టర్ మరియు 5వ సెమిస్టర్లు అన్ని పేపర్లు మూల్యంకన ఈ నెల 17 నుండి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించబడునని కళాశాల ప్రిన్సిపల్ డా. కె.శ్రీరాములు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను జారీచేసారు. వివిధ సబ్జెక్టులకు చెందిన పేపర్లు సుమారు 700 పేపరు కట్టలు వరకు మూల్యంకన చేయాల్సి ఉందని అన్నారు. కావున అర్హత గల అధ్యాపకులు ఉదయం 08.30గం.ల నుండి మధ్యాహ్నం 01.30గం.ల వరకు కళాశాలలో మూల్యంకన కొరకు హాజరుకావాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.
0 Comments