శ్రీకాకుళం, జూన్ 13 : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సిహెచ్.శ్రీరంగనాథ రాజు జిల్లాలో అమలవుతున్న నవరత్నాలు – పేదలందరకీ ఇళ్లు పై అధికారులతో నేడు సమీక్షించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటన జారీచేసారు. జూన్ 14వ తేదీ ఉదయం 10.30గం.లకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు హాజరవుతారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.
0 Comments