ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రేపు గృహనిర్మాణ శాఖ మంత్రి సమీక్ష-జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లాఠకర్ –

శ్రీకాకుళం, జూన్ 13 : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  సిహెచ్.శ్రీరంగనాథ రాజు  జిల్లాలో అమలవుతున్న నవరత్నాలు – పేదలందరకీ ఇళ్లు పై అధికారులతో నేడు సమీక్షించనున్నట్లు జిల్లా కలెక్టర్  శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటన జారీచేసారు. జూన్ 14వ తేదీ ఉదయం 10.30గం.లకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.  ఈ కార్యక్రమానికి   జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు హాజరవుతారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.

Post a Comment

0 Comments