ఇసుక రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా ఆర్టీవో కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని, రిజిస్ట్రేషన్ లేని వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇసుక రవాణాకు సంబంధించి రవాణాదారులు ఎలాంటి ఉల్లంఘనలు చేసినా అన్ని సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టాక్ యార్డు వద్ద ఎటువంటి వాహనం అనవసరంగా వేచి ఉండకుండా చూస్తామని, ఇసుక కార్యకలాపాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షించేందుకు స్టాక్ యార్డులకు సమీపంలో రెవెన్యూ/పోలీస్/పంచాయతీలతో కూడిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అంగూరు, సోమరాజుపురం లో సచివాలయం లో బుకింగ్ కేంద్రం సిద్ధం చేశామని, ఈ బుకింగ్ కేంద్రంలో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని, ప్రతీ స్లాట్ లో రెండేసి గంటలకు సమయం కేటాయించి కనీసం 15 వాహనాలకు లోడింగ్ అనుమతి ఇస్తామని, బుకింగ్ కేంద్రం ఉదయం 6.00 గంటలనుండి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే పని చేస్తుందన్నారు. రాత్రి వేళల్లో ఇసుక రవాణా నిషేధించామని స్పష్టం చేశారు.
లోడింగ్, ఇతర ఖర్చులు కలుపుకొని ఇసుకను టన్ను రూ.340 ధర నిర్ధారించినట్లు చెప్పారు. పది మెట్రిక్ టన్నులకు 10 కిలోమీటర్ల పరిధిలో రూ.1633 రవాణా చార్జీలను నిర్ణయించామని, 15 కిలోమీటర్ల పరిధికి రూ.2035, 20 కిలోమీటర్ల పరిధికి రూ.2438, 35 కిలోమీటర్ల పరిధికి రూ.3668 చొప్పున ధరను నిర్ధారించినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడం కోసం పైడి భీమవరంలో నిరంతరాయంగా పనిచేసేలాగా చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో మైన్స్ ఉప సంచాలకులు సత్యనారాయణ కూడా ఉన్నారు.
0 Comments