శ్రీకాకుళం, ఆగస్ట్ 18 :కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో 11వ జూనియర్ అంతర జిల్లాల సాఫ్ట్-బాల్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కోటబొమ్మాళి మండలం తాటిపర్తి గ్రామంలో స్వర్గీయ మెండా భాస్కరరావు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 80 అడుగుల రోడ్డులోని ప్రజా సదన్ లో సందర్శకులకు అందుబాటులో ఉంటారనీ కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
0 Comments