ఈ ఏడాదిలో ఇప్పటివరకు జిల్లాలో మొత్తంగా 618 ఫోన్లు (Rs 79,00,000/-లక్షల) రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగినది అని పేర్కొన్నారు.మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు https://www.ceir.gov.in in అనే పబ్లిక్ వెబ్ సైట్ లో పిర్యాదు చేయవలెను అని , సంబంధిత పోలీసు సమాచారాన్ని అందించాలన్నారు.మొబైల్స్ వాడే వారు తప్పనిసరిగా ఫోన్లుకు సెక్యూరిటీ లాక్ ఉపయోగించాలని,వ్యక్తిగత, విలువైన సమాచారాన్ని మొబైల్స్ లో ఉంచకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ గారు సూచించారు.
*బాధితులు స్పందన*:- అతి తక్కువ కాలంలోనే పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేసి తమకు అందచేయడంతో బాధితులు సంతోషం వ్యక్తపరచి, జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
పోగొట్టుకున్న దూర ప్రాంతాల్లో ఉన్న ఫోన్లుతో పాటు,అతి విలువైన మొబైల్ ఫోన్లు అతి తక్కువ కాలంలోనే చేదించడంలో ప్రతిభ కనబరిచిన సైబర్ సెల్ సీఐ టి. శ్రీను,సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు .
ఈ పత్రిక సమావేశంలో ఎస్బి సీఐ ఇమ్మానియల్ రాజు, సైబర్ సెల్ సీఐ టి. శ్రీను, సైబర్ సెల్ సిబ్బంది ఉన్నారు.
0 Comments